అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సర్జరీలు మరింత సులభతరంగా మారాయి : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …
కుత్బుల్లాపూర్ (సూర్యప్రభా) :ఆదివారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ నందకా అడ్వాన్స్ సర్జరీ సెంటర్ ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సంధర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ…. నేటి రోజులలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సర్జరీలు మరింత సులభతరంగా మారాయని, చికిత్స పొందుతున్న వ్యక్తి కూడా వేగంగా రికవరీ అయ్యేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత మధుసూదన చారి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యేలు కెపి.వివేకానంద్ , మల్లా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మున్సిపల్ వార్డ్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా విభాగం నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు – సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కుత్బుల్లాపూర్ సూర్య ప్రభా : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బివిఆర్ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ మొబిలిటీ లో ఆవిష్కరణ మరియు నిబద్ధతను కొనసాగిస్తూ భాజా సైన్డియా మరియు బివిఆర్ఐటి బాజా సైన్డియా 2025 హోస్ట్ చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో భాగంగా 2024 మార్చిలో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ సమీపంలో నర్సాపూర్లో బివి ఆర్ఐటి లో ప్రారంభమైన బాజా సైన్డియా 2024 యొక్క అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని భాజా సైన్డియా మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరోసారి ముందుకు నడపడానికి ప్రకటించడం ఆనందంగా ఉందని హైదరాబాద్ సమీపంలో నర్సాపూర్ లోని కెవి విష్ణురాజు స్థిరమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న టెక్నాలజీలో భాజా సైన్యా 2024 పోస్ట్ చేయడానికి అవగాహన తత్కాలికంగా 2025 ఫిబ్రవరి 2 నుండి 23 వరకు షెడ్యూల్ చేశారు .ఈ భాగస్వామ్యం ద్వారా రెండు సంస్థల యొక్క నిబద్ధత పరిశ్రమకు సిద్ధంగా ఉన్న తర్వాతి తరం ఇంజనీర్లను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఆవిష్కరణ స్థిరత్వం వైవిధ్యం మరియు పరిశ్రమ అకాడమీ సహకారాన్ని నొక్కి చెబుతుంది .బాజా 2024 ఎడిషన్ ఒక మైలు రాయిగా నిలిచిందని అన్నారుబాజా సైన్యా 2024 యొక్క విజయాన్ని ప్రతిబింబిస్తూ శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ భాష 2024 పోస్ట్ చేయడం బివిఆర్ఐటి కి గర్వకారణం మరియు చిరస్మరణీయమైన గుర్తు అని ఇది అసాధారణమైన ప్రతిభ అని హర్షం వ్యక్తం చేశారు ప్రదర్శించిన శక్తి మరియు క్రీడా స్ఫూర్తి నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. బాజా సైన్డియా అవగాహన ఒప్పందం పై సంతకం చేయడం చైర్మన్ కె.వి విష్ణురాజు స్థిరమైన మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న చలన శీలత సంస్కృతి పెంపొందించడానికి బలపరుస్తుందని అన్నారు భాజా సైన్యా సంవత్సరాల తరబడి పరిణామం గురించి వెలుగులోకి తెస్తూ భాజ సైన్డియా యొక్క ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ మరియు భారత్ పెట్రోలియం మాజీ చీఫ్ మేనేజర్ బాల్రాజ్ సుబ్రహ్మణ్యం తన తన అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ 2007లో ప్రారంభమైనప్పటి నుండి బాజా సైన్డియా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఎలక్ట్రికల్ మరియు స్వయం ప్రతిపత్తి వాహనాలను స్వీకరించే స్థాయికి ఎదగడం ఎంతో గొప్ప విషయమని ఈ ప్లాట్ఫామ్ విద్యార్థులకు ఇంజనీరింగ్ సవాళ్లను పరిష్కరించడంలో అమూల్యమైన వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందిస్తుందని అన్నారు సాంకేతిక నైపుణ్యం సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు సహకార సామర్థ్యాలతో పాల్గొనే వారిని సన్నద్ధం చేస్తుందని అగ్రశ్రేణి యజమానులు ఎక్కువగా కోరుతున్నారని అన్నారు. అనంతరం బాజా సైన్డియా యొక్క సలహాదారు డాక్టర్ కె సి ఓర భాషా యొక్క మూలాలను ప్రతిబింబించారు ఈ 10 సంవత్సరాలలో భాజా ఈవెంట్లు దేశీయంగా తయారు చేయబడిన నిత్యం ఆయా బ్యాటరీ స్వాప్ చేయగల బ్యాటరీలు శక్తివంతమైన మోటార్లు అధునాతన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం మరియు స్థిరమైన డిజైన్లను పరిచయం చేయడానికి రూపొందించబడ్డాయి అన్నారు. ఈ సందర్భంగా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి విశ్వ మీడియాను ఉద్దేశించి భాజా సైన్య అకాడమీయా మరియు పరిశ్రమల మధ్య కీలకమైన వారధిని సృష్టిస్తుందని యువ ఇంజనీర్ల ప్రతిభ పెంపొందించడంలో వారి అంచనాలపై నిబద్ధత కోసం భాజా సైన్య బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు బాజా సైన్డియా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జతిన్ కార్గ్ కృతజ్ఞతలు తెలుపుతూ 40 కంటే ఎక్కువ మంది స్పాన్సర్లు పాల్గొన్న విద్యార్థులకు స్పాట్ జాబ్ ఆఫర్లను కూడా ఇచ్చారు రాబోయే ఫెజ్- టు,బాజా సేంద్రియ 2025 యొక్క వర్చువల్ రౌండ్ నవంబర్ 2024 చివరి వారంలో షెడ్యూల్ చేయబడుతుందని ఈ రౌండ్లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన మోడల్ వేస్ట్ సిములేషన్ సాఫ్ట్వేర్ ఎల్పిజి కార్ మార్కర్ సాఫ్ట్వేర్ ఉపయోగించి వర్చువల్ డైనమిక్ ఈవెంట్ మూల్యాంకణాలతో పాటు స్టార్టింగ్ మూల్యాంకనాలు కూడా ఉంటాయని తెలిపారు. ఫేజ్-3 బాజా మరియు భాషా యొక్క ఫిజికల్ రౌండ్ 2025 జనవరి 8 నుండి 12 వరకు నెట్రాక్ పితామ్ పూర్ లో జరుగుతుందని 13 నుంచి 14 జనవరి 2025 హెచ్ఆర్ మీట్ ఉంటుందని వివరించారు బాజా 2025 యొక్క ఫిజికల్ రౌండ్ హైదరాబాద్ సమీపంలో నర్సాపూర్లో బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఫిబ్రవరి 20 నుండి 23 వరకు జరుగుతుందని దాని హెచ్ఆర్ మీట్ 24 మరియు 25 ఫిబ్రవరి 2025 జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల స్థాయి పోటీగా నిర్వహించేందుకు దేశం నలుమూలల ఉన్న విశ్వవిద్యాలయాల బృందాలు కాన్సెప్ట్ వలైజ్ డిజైన్ ఎనలైజ్ ఫ్యాబ్రికేట్ మరియు వెలిటేట్ చేసి ఒక ఆల్ టెరైన్ వెహికల్ను రన్ చేస్తారు. ఇది నాలుగు గంటలు డ్యూరబిలిటీ రన్ తో సహా స్టాటిక్ డైనమిక్ మరియు ఎన్యూరెన్స్ శ్రేణిలో మూల్యాంకణంగా చేయబడుతుందని అన్నారు. 2007లో ప్రారంభమైనప్పటి నుండి కేవలం 27 జట్లు ఓకే ఐసి ఇంజిన్ ఫార్మాట్లో పోటీ పడుతున్నాయని అన్నారు భాజా ఇప్పుడు పోటీలో నిరంతరం చరణశీలత పరిష్కారాల సరిహద్దులను ముందుకు తెస్తూ మరియు ఇంజనీరింగ్ సంఘంలో ఆవిష్కరణను ప్రోత్సహిస్తుందని తెలిపారు.
కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా దుందిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి వేడుకల్లో అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ నవరాత్రి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, శంబిపూర్ కృష్ణ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ దేవీ నవరాత్రులలో భాగంగా బుధవారం అమ్మవారు సరస్వతి అవతారంలో ఉంటూ విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లిగా పూజలందుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అర్కల అనంతస్వామి, స్థానిక బస్తీ వాసలు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లి లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ శ్యామల యాగానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఈ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా రాజ శ్యామల యాగాన్ని నిర్వహించడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఎండి రాంబాబు, బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం శ్రీ దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో,శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో,శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రీ రామాంజనేయ యువజన సంఘం చైర్మన్,కె.యం.ప్రతాప్ విచ్చేసి,అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి,అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో,శ్రీ రామాంజనేయ యువజన సంఘం సభ్యులు, కుత్బుల్లాపూర్ గ్రామ వాసులు పాల్గొన్నారు
కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం తెలంగాణ రాష్ట్ర ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబుని కలిసి మర్యాదపూర్వకంగా సన్మానించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడ్చల్ మల్కాజిగిరి డి.సి.సి ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్,ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజ జేమ్స్ తదితరులు.
కుత్బుల్లాపూర్ : సూర్య ప్రభా తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో చీఫ్ విప్ గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
కుత్బుల్లాపూర్ సూర్య ప్రభా యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై, తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజా లో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు.రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 50 మంది సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు,యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు వాటి వ్యవస్థాపకులు హాజరయ్యారు. పత్రికలకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, టీవీ చానల్స్ కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ గుర్తింపు, కంపెనీ ఆక్ట్ కింద నమోదు కావటం యూట్యూబ్ న్యూస్ చానెల్స్ కి కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. న్యూస్ వెబ్సైట్లకి కూడా అలాంటి నియమనిబంధనలే ఉన్నాయన్నది గుర్తు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపుకు అనుసరించాల్సిన అంశాల పై ఈ కార్యక్రమంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలు అయినందున వాటిని అమలుపర్చాల్సిన కర్తవ్యం యూట్యూబ్ చానెల్స్ పై ఉందని సమావేశం అభిప్రాయబడింది. అకాడమీ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ హర్షం వెలిబుచ్చారు. ఇంకా దీనిపై నిర్దిష్ట చర్యలు జరపడానికి మరిన్ని చర్చలు జరపాలని, రౌండ్ టేబుల్ లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఇది మొదటిదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అంశం పై ఇంకా లోతైన చర్చ జరగాల్సి ఉందన్నారు.
భావస్వేచ్ఛకు ఉన్న పరిమితులకు లోబడి, జర్నలిజం వృత్తికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు వార్తలు, చర్చా గోష్టిలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ సంస్థలను మాత్రమే మీడియా సంస్థలుగా గుర్తించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. సబ్ స్కయిబర్స్, వ్యూస్ ని ప్రధాన క్రైటేరియగా తీసుకోరాదని, ఎందుకంటే అంగట్లో సరుకుల్లాగా వాటి విక్రయం జరుగుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు. వ్యక్తిగత ఎజెండాలతో, ద్వేషాలతో, కక్ష్యపూరిత ధోరణులతో, సమాజాన్ని తప్పు ద్రోవ పట్టించే వైఖరితో ప్రసారాలు చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోకపోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.ఎలాంటి చట్టబద్దత లేకుండా యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లు సృష్టించి, హద్దు అదుపు లేకుండా చెలామణి అవుతున్న వారికి గుర్తింపు ఇవ్వడం ద్వారా మీడియా వ్యవస్థకు మచ్చ కలుగుతుందని, ఇందుకుగాను సంస్థ రిజిస్ట్రేషన్, లేబర్ లైసెన్స్, పోస్టల్ లైసెన్స్, ట్రేడ్ మార్క్ లైసెన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, కార్యాలయ నిర్వహణ తీరు, సిబ్బంది తదితర అంశాలను పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. యూట్యూబర్స్ చేస్తున్న ప్రసారాలు జర్నలిజం నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
సియాసత్ మేనేజింగ్ ఎడిటర్, ఎమ్మెల్సీ ఆమెరలి ఖాన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ , ముఖ్యమంత్రి సి పి ఆర్ ఓ, అయోధ్య రెడ్డి, మీడియా అకాడమీ పూర్వాధ్యక్షులు అల్లం నారాయణ, ప్రముఖ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, పద్మజా షా, ఎం. ఏ. మాజీద్, కరుణాకర్ దేశాయ్, జర్నలిస్టు సంఘాల నాయకులు విరహత్ అలీ, మామిడి సోమయ్య, పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా) మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ (టి యు డబ్ల్యూ జె హెచ్ 143) అధ్యక్షుడు సుధీర్ మంకాల పేర్కొన్నారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సూరారం కాలనీ మార్కెట్ రోడ్డు లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ప్రాంగణంలో ఉచిత మట్టి గణపతులను భక్తులకు అందజేశారు. సందర్భంగా సుధీర్ మంకాల మాట్లాడుతూ ఇప్పటికే చెరువులు కాలుష్యమైపోతున్నాయని వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు ఇతర కెమికల్స్ తో చేసిన గణపతులు పూజించి చెరువులో నిమజ్జనం చేయడం వలన చెరువులు మరింత కలుషితమయ్యే ప్రమాదం నెలకొని ఉందని, దానికోసం శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం చేస్తున్న కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతులను వారికి అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజించి పర్యావరణం కాపాడాలని ఉద్దేశంతో మట్టి గణపతులను అందరికీ ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. తమకు సహాయ సహకారాలు అందించిన సుధీర్ మంకాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారులు సర్వేపల్లి రమేష్ కుమార్, సంఘ సభ్యులు ఆలయ ప్రధాన పూజారి చక్రధారి శ్రీరామ శర్మ, సింహాచలం శ్రీధరాచార్యులు, హరి రాఘవేంద్ర, టెమ్జూ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి తో పాటు శ్రీ విజయ దుర్గ దేవాలయం కమిటీ చైర్మన్ వెంకట స్వామి, ప్రధాన సభ్యులు యాదగిరి, శ్రీనివాస్, సత్యనారాయణ, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా నియమితులైన తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ కు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అభినందనలు తెలియజేశారు. బుధవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఆయనకు జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ను పూలబొకే, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, నాయకులు తన్నీరు శ్రీనివాస్, యర్రమిల్లి రామారావు, పులిపలుపుల ఆనందం, సీహెచ్ వీరారెడ్డి తదితరులు కూడా ప్రొఫెసర్ కోదండరాం ను సన్మానించారు.